Tuesday, 24 March 2020


                                                       లోనా కరోనా..!!


కరోనా మహమ్మారి
ప్రపంచ దేశాలను
వణికిస్తూ  
వదలనంటుంది

నేలపై తిరిగే జంతువులను
భూమి పై  ప్రాకే విష సర్పాలను
మనుషులు వేటిని ముట్టుకుంటే చనిపోతారో
వాళ్ళ ...దుంపతేగా
వాటినే ఆహారంగా 
భుజిస్తే... కరోనా 
ఏమి కర్మ. .కిరొమా కు
వస్తోంది...

కరోనా దెబ్బకు
మనుషులు హౌస్ అరెస్ట్
అంటున్నారు గాని
మనసు అరెస్ట్ చేసుకొని
మనుషులెవ్వరు

ఒక ప్రక్క కుటుంబ మంత
కలిసున్నామన్న ఆనందము
కంటే 
కరోనా రాకుండా చూడు
భగవంతుడా అనే
బాధ ఎక్కువగా ఉంది

కర్ఫ్యూ లు, 
కదలలేని మనుషులు
స్వచ్ఛ మైన గాలి 
పిల్చాలి అనుకుంటే
గాలిలో వ్యాధి సోకుటుందేమో
సూర్యుడు వైపు చూద్దామంటే
భగ భగ మండుతున్నాడు
కరోనా వచ్చిన మనిషిలా

మనుషులకు దరి తోచని
పరిస్థితి 
కుప్పలు తెప్పలుగా పడున్నా
శవాలకు దహనసంస్కారాలు
ఎక్కడ...
కుళ్లుతో కంపు కొడుతున్నా
శవాలనైనా మింగేస్తారు

కరోనా తెచ్చిన ప్రాంతాల వాళ్ళు.
జర భద్రం  ప్రజానీకమా...


డా .మున్నంగి.రాజకుమారి  కాకాని.
డా.ఆర్.మున్నంగి .ఫౌండేషన్

అధ్యక్షురాలు...!!!

No comments:

Post a Comment